చివరి దశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీదే హవా

చివరి దశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. పదమూడు జిల్లాల్లోనూ వైసీపీయే ఆధిక్యత కనపర్చింది. మొత్తం నాలుగుదశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో [more]

Update: 2021-02-22 01:00 GMT

చివరి దశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. పదమూడు జిల్లాల్లోనూ వైసీపీయే ఆధిక్యత కనపర్చింది. మొత్తం నాలుగుదశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ పంచాయతీలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. 2,743 పంచాయతీలకు నాల్గోదశలో ఎన్నికలు జరిగాయి. వీటిలో అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. నాల్గుదశల్లో జరిగిన ఎన్నికల్లో ఏ దశలోనూ విపక్ష తెలుగుదేశం పార్టీ పోటీ పడకలేకపోయింది. దీంతో పల్లె ప్రాంతాల్లో రెండేళ్ల తర్వాత కూడా వైసీపీ పట్టు సడలలేదని రుజువైంది. నాలుగో విడత ఎన్నికలలో వైసీప 2,500 వరకూ పంచాయతీలను సొంతం చేసుుకోగా, టీడీపీ 488 పంచాయతీల్లో విజయం సాధించింది.

Tags:    

Similar News