ఏపీ భవన్ లో దీక్షకు ప్రభుత్వ అనుమతిచ్చింది. రేపు పార్లమెంటు సమావేశాలు చివరిరోజు కావడంతో వైసీపీ ఎంపీలు రాజీనామా చేయనున్నారు. వెనువెంటనే ఏపీ భవన్ కు వెళ్లి ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ లో తమ దీక్షకు అనుమతివ్వాలని కోరుతూ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ను ఎంపీలు రెండు రోజుల క్రితంకోరారు. వైసీపీ ఎంపీల దీక్షలను ఏపీ భవన్ లో చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.