శవాల కోసం గుంటనక్కల్లా ఎల్లో మీడియా

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక వర్గం మీడియాపై మండిపడ్డారు. ఆయన ట్విట్టర్ లో మీడియా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరు చనిపోతారా? అని ఎల్లో మీడియా [more]

Update: 2020-03-31 05:14 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక వర్గం మీడియాపై మండిపడ్డారు. ఆయన ట్విట్టర్ లో మీడియా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరు చనిపోతారా? అని ఎల్లో మీడియా గోతి కాడ గుంటనక్కలా కాచుకుని కూర్చుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖ జిల్లాలో వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందితే రేషన్ దుకాణం వద్ద నిల్చోవడం వల్లనే చనిపోయిందని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. కరోనాను ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా అదుపులో పెడుతున్నందున ఓర్వలేక డెడ్ బాడీని చూసి సంబరపడుతున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News