చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

తెలుగుదేశం ఎమ్మెల్యే హత్యపై విచారణను ఎన్ఐఏకి అప్పగించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ పై హత్యాయత్నం కేసును అప్పగిస్తే ఎందుకు బాధపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఈ [more]

Update: 2019-01-05 07:25 GMT

తెలుగుదేశం ఎమ్మెల్యే హత్యపై విచారణను ఎన్ఐఏకి అప్పగించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ పై హత్యాయత్నం కేసును అప్పగిస్తే ఎందుకు బాధపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగిస్తే ఘటనకు పాల్పడిన శ్రీనివాసరావుకు లేని బాధ చంద్రబాబు, లోకేష్ కి ఎందుకని ప్రశ్నంచారు. విచారణ వివరాలు ఎన్ఐఏకి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కేంద్రంపై నమ్మకం లేని చంద్రబాబు ఎందుకు కేంద్రం ఇచ్చిన జెడ్ ప్లస్ సెక్యూరిటీలో తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఎన్ఐఏ విచారణ ద్వారా జగన్ పై దాడి చేయించిన వ్యక్తులు బయటకు వస్తారని పేర్కొన్నారు. తమ పార్టీ ఎన్నడూ బీజేపీతో కలవలేదని, కలిసేది కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. అధికారం కోసం గాడిద కాళ్లు సైతం పట్టుకునే చంద్రబాబు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. కాకినాడలో నిలదీసిన మహిళను ఫినిష్ అవుతారని చంద్రబాబు హెచ్చరించారని, ఇంకా ఎంతమందిని ఫినిష్ చేస్తారని ప్రశ్నించారు.

Tags:    

Similar News