చంద్రబాబు సముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నారా..?

Update: 2018-12-20 09:51 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్య బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని ఆరోపించారు. తుఫాన్ ని ఓడించడానని ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారని, తామే తుఫాన్ లను గుర్తించామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సముద్రాన్ని సైతం కంట్రోల్ చేస్తున్నామని చంద్రబాబు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాల కంట్రాక్టులు కేవలం ఐదారు కంపెనీలకే ఎక్కువ ధరలకు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి స్క్వేర్ ఫీట్ రూ.900-1000కి కడుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.1,600 కాంట్రాక్టర్లకు చెల్లిస్తూ రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.

Similar News