టీడీపీ రిగ్గింగ్ ను ఆపండి

ప్రజాస్వామ్యం గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులపైనే దాడులు చేయిస్తున్నారని వైసీపీ నేతలు నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ [more]

Update: 2019-04-11 11:30 GMT

ప్రజాస్వామ్యం గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులపైనే దాడులు చేయిస్తున్నారని వైసీపీ నేతలు నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థులపై టీడీపీ దాడులపై వారు సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. పలు బూత్ లను టీడీపీ బూత్ క్యాప్చర్ చేసిందని, యధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడుతోందని వారు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆధారాలుగా సమర్పించారు. ముందెన్నడూ లేనట్లు ఏకంగా అభ్యర్థులపైనే దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. పోలింగ్ కు చివరి గంట సమయం ఉందనగా టీడీపీ తెగబడే అవకాశం ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు. చివరి గంట సేపు ఎన్నికల సంఘం టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడకుండా అడ్డుకోవాలని కోరారు.

Tags:    

Similar News