జగన్ అనుచరులే ధనవంతులవుతున్నారు

వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. పేదరికం పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని యనమల ప్రశ్నించారు. విద్య, వైద్య రంగాలపై [more]

Update: 2021-06-14 05:21 GMT

వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. పేదరికం పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని యనమల ప్రశ్నించారు. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం తక్కువ ఖర్చుపెడుతుందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, భవిష్యత్ లో ఇది ప్రమాదకరమని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. పేదలు మరింత పేదలుగా మారుతుండగా, జగన్ అనుచరులు మాత్రం ధనవంతులు అవుతున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాలని యనమల సూచించారు.

Tags:    

Similar News