జగన్ బ్యాడ్ విల్ తో ఏపీ గుడ్ విల్ పోయింది

రాష్ట్రం మరో ముప్ఫయి ఏళ్ల పాటు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. [more]

Update: 2020-07-26 04:08 GMT

రాష్ట్రం మరో ముప్ఫయి ఏళ్ల పాటు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. ముప్ఫయి ఏళ్లకు సరిపడా అప్పులను వైసీపీ ప్రభుత్వం చేసిందని యనమల రామకృష్ణుడు తెలిపారు. 2024 కు వడ్డీ, అసలు చెల్లింపులు లక్ష కోట్లు చెల్లించాల్స వస్తుందని యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్ బ్యాడ్ విల్ ఆంధ్రప్రదేశ్ గుడ్ విల్ ను దెబ్బతీసిందని ఆయన తెలిపారు. బిల్డప్ మిషన్ ఏపీ కాదని, వైసీపీ బిల్డప్ మిషన్ అని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News