కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు లేదని బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు. ప్రజలు తిరస్కరిస్తున్నా కాంగ్రెస్ అధికారం కోసం పాకులాడుతుందన్నారు. మీడియాతో మాట్లాడిన యడ్యూరప్ప సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. ప్రజలు మార్పు కోరుతూ తీర్పునిచ్చారని, అతిపెద్ద పార్టీకే తొలుత గవర్నర్ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.