జగన్ కు భద్రత పెంచుతాం...!!

Update: 2018-11-02 09:35 GMT

వైసీపీ అధినేత జగన్ కు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని, భద్రతను పెంచుతామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ తెలిపారు. నేతలతో పాటు ప్రజలకు కూడా భద్రత కల్పించడం తమ కర్తవ్యమని ఆయన తెలిపారు. జగన్ వద్దకు రెండుసార్లు విచారణ కోసం వెళ్లినా ఆయన సహకరించలేదన్నారు. జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ కస్టడీ పెంపు కోరడం విచారణాధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. విచారణ నిష్పక్షపాతంగానే జరుగుతుందన్నారు. మరోసారి అధికారులు జగన్ ను కలిసి విచారణకు సహకరించాలని కోరతారన్నారు.

Similar News