లాక్ డౌన్ లో మద్యం కోసం లూటీ

మద్యం కోసం మందు బాబులు తహతహలాడుతున్నారు. మద్యం ఎక్కడ దొరికితే అక్కడ వరకు వెళుతూ తాగుతున్నారు. బ్లాక్ లో దొరికిన మద్యాన్ని తెగ తాగేస్తున్నారు. అయితే కొందరు [more]

Update: 2020-04-04 12:31 GMT

మద్యం కోసం మందు బాబులు తహతహలాడుతున్నారు. మద్యం ఎక్కడ దొరికితే అక్కడ వరకు వెళుతూ తాగుతున్నారు. బ్లాక్ లో దొరికిన మద్యాన్ని తెగ తాగేస్తున్నారు. అయితే కొందరు మందు బాబులు మాత్రం ఏకంగా లూటీలకు పాల్పడుతున్నారు. గాంధీనగర్ ప్రాంతంలోని లక్ష్మీ వైన్స్ లో అర్ధరాత్రి ల్యూటీ జరిగింది. వైన్ షాపు వెనకాల రంధ్రం చేసి లోపలికి వెళ్లారు మందుబాబులు. లోపల ఉన్న మొత్తం స్టాక్ ను కూడా ఎత్తుకుపోయారు. దాదాపు మూడు లక్షల విలువచేసే మద్యం పోయినట్లు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైన్ షాపు వెనుక భాగంలో ఉన్న గోడకు రంధ్రం చేశారు. రంధ్రం గుండా లోపలికి వెళ్లి ఆ షాప్ లో ఉన్న మద్యాన్ని పూర్తిగా ఎత్తుకుపోయారు. అయితే మద్యం ఎత్తుక పోయింది మందుబాబులా లేక దొంగలా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి సిసి కెమెరాల ద్వారా పూర్తిగా నిందితులు ఎవరనే విషయాన్ని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.

Tags:    

Similar News