చ‌ర్చ ప్రారంభించ‌క ముందే వాకౌట్‌

Update: 2018-07-20 07:07 GMT

దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ ప్రారంభం కాక‌ముందే స‌భ నుంచి బిజూ జ‌న‌తాద‌ళ్‌(బీజేడీ) వాకౌట్ చేసింది. అవిశ్వాస తీర్మానంతో ఒడిశాకు ఒరిగేదేమీ లేద‌ని, ఒడిశాకు జ‌రుగుతున్న అన్యాయంపై ఏ ప్ర‌భుత్వం కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అందుకే స‌భ నుంచి వాకౌట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి వెళ్లిపోయారు. ఆ పార్టీకి లోక్‌స‌భ‌లో 20 మంది ఎంపీలు ఉన్నారు. వీరు ఓటింగ్ లో పాల్గొన‌క‌పోతుండ‌టం బీజేపీకి అనుకూలంగా మార‌నుంది. బీజేడీ స‌భ్యులు వాకౌట్ చేస్తున్న స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చిరున‌వ్వు న‌వ్వ‌డం గ‌మ‌నార్హం.

 

 

 

Similar News