జగన్ చీడపురుగు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి ఫైరయ్యారు. విజయవాడ లోని తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎంపీ కేశినేని [more]

Update: 2020-02-08 06:36 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి ఫైరయ్యారు. విజయవాడ లోని తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ పోలవరం, రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా జగన్ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ చీడ పురుగులా మారి రాష్ట్రంలో అభివృద్దిని అటకెక్కించారని విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ గెలిచిందని అభివృద్ధికి నిధులు నిలిపివేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామని కేశినేని తెలిపారు. ఇప్పటికే ఎయిర్ పోర్టు, అవుటర్ బైపాస్ రోడ్డులకు కేంద్రం ద్వారా నిధులు విడుదల చేయించామని, అభివృద్ధి, సంక్షేమం టీడీపీ ద్వారానే సాధ్యమని కేశినేని తెలిపారు.

Tags:    

Similar News