మరిన్ని వీడియోలు వస్తాయి: విజయసాయి వార్నింగ్

అవతలి వ్యక్తి యుద్ధం ప్రకటించాక వెనుదిరగడం వైసీపీకి తెలియదని, యుద్ధాన్ని ఎదుర్కోవడం, పోరాడటమే తెలుసని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో [more]

Update: 2019-04-08 08:25 GMT

అవతలి వ్యక్తి యుద్ధం ప్రకటించాక వెనుదిరగడం వైసీపీకి తెలియదని, యుద్ధాన్ని ఎదుర్కోవడం, పోరాడటమే తెలుసని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… రాధాకృష్ణ తాను మాట్లాడినట్లుగా ఫేక్ ఆడియో ప్రసారం చేశారని, అది తన గొంతే కాదన్నారు. విశాఖపట్నంలో సంబంధం లేని గొడవను వైసీపీకి అంటగట్టారని ఆరోపించారు. ఇలా వైసీపీపై రాధాకృష్ణ యుద్ధం ప్రకటించారు. అందుకే చంద్రబాబు – రాధాకృష్ణ సంభాషణ సోషల్ మీడియాలో బయటకు వచ్చిందన్నారు. ఇంకా చాలా వీడియోలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. స్వంత మామనే వాడు అని తిడుతున్నారని, చనిపోయిన వ్యక్తిని, స్వంత మామను వాడు అని సంభోదించే వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమేనన్నారు. బురదగుంటలో ఉండాల్సిన వ్యక్తిని మీడియా యాజమానిని చేస్తే, దుర్మార్గుడిని ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో స్పష్టం చేస్తుందన్నారు. రాధాకృష్ణ, చంద్రబాబు ఎంత దుర్మార్గులో వారి సంభాషణ చెబుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు, టీడీపీ అభిమానులు చంద్రబాబు నిజస్వరూపాన్ని తెలుసుకోవాలన్నారు.

Tags:    

Similar News