అలా దాక్కుంటే ఎలా బాబూ?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ కు భయపడి చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ లో [more]

Update: 2020-11-23 08:09 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ కు భయపడి చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ నుంచి వలస కూలీలు కూడా తిరిగి పనులకు వస్తున్నారని, కానీ తండ్రీకొడుకులు మాత్రం ఏపీకి రావడం లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వలస పక్షులు కూడా రాష్ట్రానికి వస్తున్నాయని, వీరిద్దరికి మాత్రం బయటకు వచ్చే ధైర్యం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖపై కొందరు కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అవి చెల్లవని విజయసాయిరెడ్డి అన్నారు.

Tags:    

Similar News