పచ్చ బ్యాచ్ కు అంత కోపమెందుకో?

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో విమర్శించారు. అక్రమ కట్టడాలను కూలిస్తే పచ్చ బ్యాచ్ మొత్తం [more]

Update: 2020-10-26 04:00 GMT

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో విమర్శించారు. అక్రమ కట్టడాలను కూలిస్తే పచ్చ బ్యాచ్ మొత్తం బాధపడిపోతుందన్నారు. గతంలో ఆంధ్రయూనివర్సిటీని ఆయన దయ్యాల కొంపగా అన్నప్పుడు ఎవరూ మాట్లాడలేదే? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే వాటిని తొలగించడం తప్పా? అని పేదల ప్రయోజనాలకన్నా పచ్చ బ్యాచ్ ప్రయోజనాలే చంద్రబాబుకు ఎక్కువయ్యాయన్నారు. అలాగే చంద్రబాబుకు 28 ఏళ్ల క్రితం ఈనిని గేద వందల కోట్ల రూపాయల పాలిచ్చిందని, ఆ గేదెకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూముల్లో నోట్ల కట్టలు పండకపోతే చంద్రబాబుకు కోపం రాదా? అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News