అంత కడుపు మంట ఎందుకు బాబూ?

వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో టీడీపీపై దాడికి దిగారు. మరో పాతికేళ్ల పాటు ఏడుస్తూనే ఉండండంటూ [more]

Update: 2020-10-12 03:13 GMT

వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో టీడీపీపై దాడికి దిగారు. మరో పాతికేళ్ల పాటు ఏడుస్తూనే ఉండండంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జగనన్న విద్యాకానుక పేరుతో జగన్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటే, టీడీపీ నేతలు మాత్రం తమ కడుపుమంటను వెళ్లగక్కుతున్నారన్నారు విజయసాయిరెడ్డి. హైక్వాలిటీ కిట్లను అందించినా టీడీపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తుండటాన్ని విజయసాయిరెడ్డి తప్పు పట్టారు.

Tags:    

Similar News