విజయవాడ మీరు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ అనుమతులపై చర్చకు సిద్ధమని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. ఎల్జీ [more]

Update: 2020-05-20 06:50 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ అనుమతులపై చర్చకు సిద్ధమని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. ఎల్జీ పాలిమర్స్ కు ఎవరు అనుమతులిచ్చారో చర్చించేందుకు తాను సిద్ధమని, విజయవాడకు మీరు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇక విద్యుత్తు ఛార్జీలు పెంచడంపై చంద్రబాబు విమర్శలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. తన హయాంలో చంద్రబాబు ఎన్నిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారో గుర్తు చేసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. బషీర్ బాగ్ కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన విషయం చంద్రబాబు మర్చి పోయినట్లుందని సెటైర్ వేశారు.

Tags:    

Similar News