ఏపీలో నారా 420 వైరస్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొత్త వైరస్ వచ్చిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారన్నారు. [more]

Update: 2021-05-08 00:26 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొత్త వైరస్ వచ్చిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారన్నారు. హైదరాబాద్ పారిపోయినా నారా 420 వైరస్ ఆనవాళ్లు మాత్రం ఏపీలో ఉన్నాయని విజయసాయిరెెడ్డి ఎద్దేవా చేశారు. పథ్నాలుగేళ్లు సీఎంగా వెలగబెట్టానని చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ వైద్య రంగంలో విస్తరణ పనులకు పూనుకోలేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైద్యం ప్రభుత్వం బాధ్యతే కాదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గురివింద నీతులు చెబుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News