వైసీపీని వీడేందుకు కారణం చెప్పిన రాధా

తన తండ్రికి అన్ని పార్టీల్లోనూ అభిమానులున్నారని, కొంతమంది వ్యక్తులు చేసిన తన తండ్రి హత్యను ఒక పార్టీకి అంటగట్టడం సరికాదని వైసీపీని వీడిన వంగవీటి రాధాకృష్ణ స్పష్టం [more]

Update: 2019-01-24 07:40 GMT

తన తండ్రికి అన్ని పార్టీల్లోనూ అభిమానులున్నారని, కొంతమంది వ్యక్తులు చేసిన తన తండ్రి హత్యను ఒక పార్టీకి అంటగట్టడం సరికాదని వైసీపీని వీడిన వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… నాలుగేళ్లుగా తన క్యారెక్టర్ ను వైసీపీలో తక్కువ చేశారని పేర్కొన్నారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లాలన్నా వైసీపీ వెళ్లనివ్వలేదని ఆరోపించారు. జగన్ ఇప్పటికైనా రంగాను, ఆయన అభిమానులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు.

అవమానాలు అన్నీ ఇన్నీ కావు…..

వైసీపీలో తనకు జరిగిన అవమానాలు ఎవరికీ జరగలేదన్నారు. తన తండ్రి ఆశయాలు నెరవేర్చడమే తనకు ముఖ్యమని, ఆయన ఆశయాలు ఏ పార్టీ నెరవేరిస్తే ఆ పార్టీలోకి వెళ్తానన్నారు. చంద్రబాబు.. పార్టీ నేతలను పంపించి తనను టీడీపీలోకి ఆహ్వానించారని తెలిపారు. ఆలోచన లేకుండా ఆవేశంతో తాను గతంలో మాట్లాడిన మాటలు పట్టించుకోవద్దన్నారు. అయితే, ఆయన టీడీపీలో చేరుతారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మీడియా సమావేశంలో రాధా… కొన్ని ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News