వచ్చే నెల 4వ తేదీన అమిత్ షా తిరుపతి రాక

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా వచ్చే నెల 4వ తేదీన తిరుపతికి రానున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి [more]

Update: 2021-02-18 00:59 GMT

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా వచ్చే నెల 4వ తేదీన తిరుపతికి రానున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండల సదస్సులో పాల్గొనేందుకు అమిత్ షా తిరుపతి రానున్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనే అమిత్ షా మరుసటి రోజు అంటే 5వ తేదీన పార్టీ సమావేశంలో కూడా పాల్గొననున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికపై ఆయన పార్టీ నేతలతో చర్చిస్తారని తెలుస్తోంది. జనసేన, బీజేపీ ల నుంచి అభ్యర్థి ఎవరన్నది అమిత్ షా ఈసమావేశంలో నిర్ణయిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News