అనారోగ్యంతో ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేల మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ప‌నిచేసిన ఇద్ద‌రు నేత‌లు అనారోగ్యంతో ఇవాళ క‌న్నుమూశారు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నుంచి 2004లో స్వ‌తంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన బూచేప‌ల్లి సుబ్బారెడ్డి అనారోగ్యంతో [more]

Update: 2019-05-11 11:28 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ప‌నిచేసిన ఇద్ద‌రు నేత‌లు అనారోగ్యంతో ఇవాళ క‌న్నుమూశారు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నుంచి 2004లో స్వ‌తంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన బూచేప‌ల్లి సుబ్బారెడ్డి అనారోగ్యంతో హైద‌రాబాద్ లోని ఓ ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు. ఆయ‌న కుమారుడు బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి ద‌ర్శి నుంచి 2009లో ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. ఆయ‌న ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మ‌ల్కాజ్ గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప‌నిచేసిన చింత‌ల క‌న‌కారెడ్డి సైతం ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి విజ‌యం సాధించారు. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టిక్కెట్ ద‌క్క‌లేదు. క‌న‌కారెడ్డి మృతికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News