ఢిల్లీ గులాములకు ఓట్లేయొద్దు..!

ఢిల్లీకి గులాములుగా ఉండే కాంగ్రెస్ ను గెలిపించవద్దని.. కొట్లాడి నిధులు సాధించగలిగే టీఆర్ఎప్ ని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం [more]

Update: 2019-03-06 10:07 GMT

ఢిల్లీకి గులాములుగా ఉండే కాంగ్రెస్ ను గెలిపించవద్దని.. కొట్లాడి నిధులు సాధించగలిగే టీఆర్ఎప్ ని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ లో ఆయన పార్లమెంటు సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ… ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కు గానీ, యూపీఏకు గానీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, రాష్ట్రంలో 16 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతామన్నారు. కొట్లాడి రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున ఎంపీలుగా కూడా టీఆర్ఎస్ వారే ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ స్థానంలో 5 లక్షల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Tags:    

Similar News