స్పీడ్ పెంచిన టీఆర్ఎస్ ఎంపీలు

Update: 2018-12-19 06:26 GMT

తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. వారు కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. బుధవారం ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందనంగా ఒక్కరూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. హైకోర్టును త్వరగా విభజించాలన్నారు. ఈ మేరకు ఆయా శాఖల మంత్రులను కలిసి వినవించామని తెలిపారు.

Similar News