బ్రేకింగ్ : ప్రత్యర్థులపై టీఆర్ఎస్ నేతల దాడి

Update: 2018-12-06 06:41 GMT

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ రెబల్, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి అనుచరులపై టీఆర్ఎప్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇన్నోవా కారు ధ్వంసం అవడంతో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలంటూ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Similar News