బ్రేకింగ్: వివేకా హత్య కసులో ముగ్గురి అరెస్ట్

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివేకానందరెడ్డి హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని గుర్తించిన [more]

Update: 2019-03-28 09:45 GMT

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివేకానందరెడ్డి హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని గుర్తించిన పోలీసులు వివేకా అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాష్ ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రకటించారు. పోలీసులు రాకముందే మృతదేహాన్ని తరలించారని, వివేకా రాసిన లేఖను పోలీసులకు ఇవ్వకుండా సాక్షాలను తారుమారు చేశారని పోలీసులు తెలిపారు. ఇవాళ వారిని పులివెందుల కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ నెల 15 పులివెందులలో వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. 13 రోజులు గడిచినా ఈ కేసులో హంతకులెవరనేది తేలలేదు.

Tags:    

Similar News