బ్రేకింగ్ : శ్రీశైలంలో భారీ కుంభకోణం… కోట్లాది రూపాయలు మాయం

శ్రీశైలంలో భారీ కుంభకోణం జరిగింది. కోట్లాది రూపాయల భక్తుల సొమ్మును కాజేశారు. సాఫ్ట్ వేర్ ను మార్చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు. 150 రూపాయల శీఘ్రదర్శనంలో [more]

Update: 2020-05-25 07:21 GMT

శ్రీశైలంలో భారీ కుంభకోణం జరిగింది. కోట్లాది రూపాయల భక్తుల సొమ్మును కాజేశారు. సాఫ్ట్ వేర్ ను మార్చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు. 150 రూపాయల శీఘ్రదర్శనంలో కోటి రూపాయలు మాయం చేశారు. 1500ల అభిషేకం టిక్కెట్లలో యాభై లక్షలు, సర్వదర్శనం, కంకణం టిక్కెట్లలోనూ యాభై లక్షలు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు.అకామిడేషన్ విభాగంలో యాభై లక్షల అవినీతి జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరిపాలని నిర్ణయించారు. దేవాదాయశాఖకు కూడా నివేదికను పంపినట్లు తెలుస్తోంది. దాదాపు కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్లు సమాచారం. దీనిపై ఉద్యోగులు ఈవో కు ఫిర్యాదు చేశారు. ఈవో కూడా అవినీతి జరిగిందని అంగీకరించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News