మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం

తెలంగాణ మంత్రి మండలి సమావేశం ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ముఖ్యంగా నూతన సచివాలయం నిర్మాణంపై కేసీఆర్ [more]

Update: 2020-08-02 02:34 GMT

తెలంగాణ మంత్రి మండలి సమావేశం ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ముఖ్యంగా నూతన సచివాలయం నిర్మాణంపై కేసీఆర్ చర్చించనున్నారు. సచివాలయం డిజైన్లను ఖరారు చేయనున్నారు. ఇక రోజురోజుకూ తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా హైదరాబాద్ లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీనిపై కూడా కేసీఆర్ మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు ఇంతవరకూ తెరుచుకోలేదు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంపై కూడా కేసీఆర్ సమావేశంలో చర్చించనున్నారు.

Tags:    

Similar News