ఆర్టీసీ జేఏసీ నేతల అరెస్ట్

ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. రోజుకో ప్రణాళిక ప్రకారం జేఏసీ నేతలు ముందుకు వెళ్తున్నారు. ఇవ్వాళ గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించేందుకు [more]

Update: 2019-10-07 07:00 GMT

ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. రోజుకో ప్రణాళిక ప్రకారం జేఏసీ నేతలు ముందుకు వెళ్తున్నారు. ఇవ్వాళ గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించేందుకు వచ్చిన జేఏసీ కన్వీనర్ అశ్వద్థామ రెడ్డితో పాటు ఇతర సంఘాల నేతలను, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుని అరెస్టుచేశారు. వీరిని మహంకాళి పోలీసు స్టేషన్ కు తరలించారు. జిల్లాల్లోనూ నిరసనలు వ్యక్తం చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Tags:    

Similar News