కంట్రోల్ అయినప్పటికీ?

ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 34కు చేరుకుంది. సీఏఏకు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితి కొంత [more]

Update: 2020-02-27 05:00 GMT

ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 34కు చేరుకుంది. సీఏఏకు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితి కొంత సద్దుమణిగినప్పటికీ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇవాళ ఒక్కరోజే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందారు. ఈశాన్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పోలీసు పహారా పెరిగినా ప్రజలు ఇంకా స్వేచ్ఛగా బయటకు రావడం లేదు. ఢిల్లీలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ఉన్నాయి.

Tags:    

Similar News