కేసీఆర్ నీ బెదిరింపులకు భయపడేది లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడితే అంగీకరించే ప్రసక్తి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. తొలుత నిర్మించిన ప్రాజెక్టులకే నీటి విడుదలలో ప్రాధాన్యత [more]

Update: 2021-07-06 06:50 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడితే అంగీకరించే ప్రసక్తి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. తొలుత నిర్మించిన ప్రాజెక్టులకే నీటి విడుదలలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల కోసమే నీటి వివాదం తీసుకువచ్చారని టీజీ వెంకటేష్ ఉన్నారు. సివిల్ వార్ కు దారి తీసేలా తెలంగాణ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ బెదిరింపులకు ఏపీ నేతలు ఎవరూ భయపడరని ఆయన అన్నారు. మీ ప్రాంతంలోనే మా ఆంధ్రప్రజల ఓట్లు ఉన్నాయని, ఏపీలో తెలంగాణ ప్రజల ఓట్లు లేవని కేసీఆర్ గుర్తుంచుకోవాలని టీజీ వెంకటేష్ హెచ్చరించారు. ఈ వివాదాన్ని ఎక్కువగా లాగితే అక్రమంగా తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులకు ఎసరు వస్తుందని టీజీ వెంకటేష్ అన్నారు.

Tags:    

Similar News