ఏపీ నుంచి రానివ్వరట… తమిళనాడు గోడలు కట్టింది

ఆంధ్రా, తమిళనాడుల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమిళనాడు, ఆంధప్రదేశ్ సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం ఆరు అడుగుల గోడను నిర్మించింది. తిరుత్తణి, శెట్టి తంగాళ్, బొమ్మ సముద్రం [more]

Update: 2020-04-27 04:28 GMT

ఆంధ్రా, తమిళనాడుల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమిళనాడు, ఆంధప్రదేశ్ సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం ఆరు అడుగుల గోడను నిర్మించింది. తిరుత్తణి, శెట్టి తంగాళ్, బొమ్మ సముద్రం ప్రాంతాల్లో రహదారులపై గోడను నిర్మించింది. ఏపీ తమిళనాడుల మధ్య రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో కూడా కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో ఏపీ నుంచి ఏ ఒక్కరూ రాకుండా గోడలను నిర్మించింది. జిల్లా కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమయింది. ఏపీ అధికారులు గోడ నిర్మాణం పట్ల అభ్యంతరం తెలుపుతున్నారు. చెక్ పోస్టులు ఉన్నా గోడను రహదారిపై నిర్మించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News