జగన్ కు బాబు ఇలా షాకిస్తారా…?

ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో వలసలు జోరందుకుంటున్నాయి. నిన్నటి వరకు రోజుకొకరు చొప్పున ప్రజాప్రతినిధులు, నేతలను పార్టీలో చేర్చుకుంటూ టీడీపీకి వైసీపీకి వరుస షాక్ [more]

Update: 2019-02-20 11:27 GMT

ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో వలసలు జోరందుకుంటున్నాయి. నిన్నటి వరకు రోజుకొకరు చొప్పున ప్రజాప్రతినిధులు, నేతలను పార్టీలో చేర్చుకుంటూ టీడీపీకి వైసీపీకి వరుస షాక్ లు ఇచ్చింది. అయితే, వారం రోజుల పర్యటనకు వైసీపీ అధినేత జగన్ లండన్ వెళ్లడంతో వైసీపీలోకి వలసలకు తాత్కాతికంగా బ్రేక్ పడింది. ఇక, ఇప్పుడు టీడీపీలోకి వలసలు జోరందుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ నెల 28న టీడీపీలో చేరనున్నారు.

డీఎల్ రవీంద్రారెడ్డి కూడా….

కడప జిల్లా నేత డీఎల్ రవీంద్రారెడ్డి కూడా ఇవాళ చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఆయనకు మైదుకూరు టిక్కెట్ ఖరారు చేస్తే ఆయన కూడా టీడీపీలో చేరనున్నారు. ఇక, మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ఇప్పటికే టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైసీపీని వీడిన వంగవీటి రాధా కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎవరెవరు పార్టీలు మారుతారో చూడాలి.

Tags:    

Similar News