వంశీని సస్పెండ్ చేస్తారా?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ నిన్న మీడియా ముందుకు వచ్చి లోకేష్ తో పాటు చంద్రబాబు [more]

Update: 2019-11-15 08:07 GMT

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ నిన్న మీడియా ముందుకు వచ్చి లోకేష్ తో పాటు చంద్రబాబు పై కూడా విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. మరోవైపు దేవినేని ఉమను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ను అసభ్య కర పదజాలంతో దూషించారు. దీంతో వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు.

జగన్ కు మద్దతిస్తానని చెప్పాక….

తాజాగా సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో వంశీ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పలువురు నేతలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. వైఎస్ జగన్ కు మద్దతిస్తున్నట్లు బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా పార్టీలో ఉంచుకోవడం తప్పు అవుతుందని చంద్రబాబు సయితం భావిస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో దీనిపై టీడీపీ ఒక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News