రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి టీడీపీ పిలుపు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. విశాఖకే పరిమితమైన ఆందోళనలను రాష్ట్రం మొత్తానికి విస్తరించాలని భావిస్తుంది. ఈ [more]

Update: 2021-02-16 01:07 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. విశాఖకే పరిమితమైన ఆందోళనలను రాష్ట్రం మొత్తానికి విస్తరించాలని భావిస్తుంది. ఈ నెల 18వ తేదీన స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. జగన్ కేసుల మాఫీ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం భవిష్యత్ లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News