మరోసారి జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ

ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టును వెంటనే కేంద్ర గెజిట్ లో చేర్చాలని [more]

Update: 2021-07-16 12:23 GMT

ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టును వెంటనే కేంద్ర గెజిట్ లో చేర్చాలని ఎమ్మెల్యేలు లేఖలో డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై పునరాలోచించాలని టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం రెండేళ్లుగా పట్టించుకోవడం లేదన్నారు. ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలే దిక్కు అని, తెలంగాణ, ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో ప్రకాశం జిల్లా ఎడారిగా మారనుందని టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, బాలనారాయణ స్వామిలు కోరారు.

Tags:    

Similar News