లోకేష్ పై ఫైరయిన టీడీపీ నేత

నారా లోకేష్ వల్లనే తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో కోలుకోలేని దెబ్బతినిందని ఆ పార్టీ నగర అధ్యక్షుడు రహమాన్ తెలిపారు. నారా లోకేష్ విశాఖపట్నంలో అడుగుపెట్టడం వల్లనే పార్టీ [more]

Update: 2019-12-26 06:33 GMT

నారా లోకేష్ వల్లనే తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో కోలుకోలేని దెబ్బతినిందని ఆ పార్టీ నగర అధ్యక్షుడు రహమాన్ తెలిపారు. నారా లోకేష్ విశాఖపట్నంలో అడుగుపెట్టడం వల్లనే పార్టీ నాశనమయిందన్నారు. కొద్దిసేపటి క్రితం రహమాన్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ వల్ల పార్టీకి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తప్పవన్నారు. విశాఖ నగరాన్ని ఐదేళ్ల పాటు అభివృద్ధి చేయకుండా టీడీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనను రహమాన్ సమర్థించారు.

Tags:    

Similar News