అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రావణ్ కుమార్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఈస్టర్ సందర్భంగా ఆయన [more]

Update: 2019-04-23 08:23 GMT

అమెరికాలో తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రావణ్ కుమార్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఈస్టర్ సందర్భంగా ఆయన స్నేహితులతో కలిసి బోస్టన్ బీచ్ కు వెళ్లాడు. దీంతో ప్రమాదవశాత్తూ అలల ఉదృతి ఎక్కువగా ఉండటంతో ఆయన సముద్రంలో గల్లంతయ్యాడు. శ్రావణ్ స్నేహితుల ఫిర్యాదుతో సముద్రంలో గాలించిన గజ ఈతగాళ్లు శ్రావణ్ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags:    

Similar News