చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉంది

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రమాదం పొంచి ఉందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏం జరిగిన నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ దే బాధ్యత అని [more]

Update: 2019-03-27 07:53 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రమాదం పొంచి ఉందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏం జరిగిన నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ దే బాధ్యత అని అన్నారు. కొన్ని రోజుల్లో రాష్ట్రంలో హత్యలు జరగబోతున్నాయని జగన్ అన్నారని, జగన్ వ్యాఖ్యలతో తమకు అనుమానం వస్తోందన్నారు. ఇక, ఇంటెలిజెన్స్ డీజీని ఉన్నఫళంగా తీసేస్తే ముఖ్యమంత్రి బాధ్యత ఏం కావాలని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ లా ఆండ్ ఆర్డర్ చూసుకోరని, కేవలం ముఖ్యమంత్రి భద్రత మాత్రమే చూసుకుంటారని అన్నారు. ఎన్నికలతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీని ఎలా బదిలీ చేస్తారని అన్నారు. ఇలాంటి ఎన్నికల సంఘం ఉంటే ఎన్నికలు ఎలా సక్రమంగా జరుగుతాయని ప్రశ్నించారు.

Tags:    

Similar News