స్వరూపానందేంద్రను కలిసిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్ జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానానికి వెళ్లారు. అక్కడ విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు కేసీఆర్ తీసుకున్నారు. ఇటీవల స్వరూపానందేంద్రను [more]

Update: 2019-04-27 09:01 GMT

తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్ జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానానికి వెళ్లారు. అక్కడ విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు కేసీఆర్ తీసుకున్నారు. ఇటీవల స్వరూపానందేంద్రను పలుమార్లు కేసీఆర్ కలిసి ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. స్వరూపానందేంద్ర సూచనల మేరకే ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం చేశారు. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక కేసీఆర్ విశాఖపట్నం వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకొని, రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్వరూపానంద హైదరాబాద్ లో ఉండటంతో ఆయనను కేసీఆర్ కలిశారు.

Tags:    

Similar News