నేడు తెలంగాణ కేబినెట్ భేటీ .. లాక్ డౌన్ పై..?

నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ సమావేశం [more]

Update: 2021-05-11 01:17 GMT

నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ సమావేశం చర్చించనుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించాలా? లేదా? అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్ డౌన్ విధిస్తే ఎదురుకానున్న సమస్యలపై కేబినెట్ సమావేశం చర్చించనుంది. దీంతో పాటు ధాన్యం కొనుగోలుపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఈనెల 15 వతేదీ నుంచి లాక్ డౌన్ విధించే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News