వైసీపీ నేతపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరాంనగర్ 9వ పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మట్టా రాజుపై తెలుగుదేశం [more]

Update: 2019-04-11 03:06 GMT

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరాంనగర్ 9వ పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మట్టా రాజుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే దాడిలో మట్టా రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను స్థానికంగా ఉన్న ఏలూరు ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడ కూడా టీడీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఏలూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Tags:    

Similar News