తెలంగాణ సర్కార్ పై కేసు పెట్టనున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య యద్ధంగా మారుతోంది. డేటా తమది కాబట్టి ఈ కేసును తమకు బదిలీ చేయాలని ఏపీ [more]

Update: 2019-03-06 11:16 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య యద్ధంగా మారుతోంది. డేటా తమది కాబట్టి ఈ కేసును తమకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ కు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు ఈ కేసు విచారణను ముమ్మరం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వమే తమ డేటాను దొంగలించిందని టీడీపీ ఇప్పటికే ఆరోపణలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టాలని టీడీపీ నిర్ణయించింది. తమ డేటాను తెలంగాణ ప్రభుత్వ చోరీ చేసిందని కేసు పెట్టనున్నారు. దీంతో పాటు పరువు నష్టం కేసును కూడా తెలంగాణ ప్రభుత్వంపై పెట్టాలని టీడీపీ నిర్ణయించింది.

Tags:    

Similar News