governor : గవర్నర్ ను కలవనున్న టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనను టీడీపీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ [more]

Update: 2021-09-18 06:38 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనను టీడీపీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. గవర్నర్ ను కలిసేందుకు వర్లరామయ్య, గద్దె రామ్మోహన్, అశోక్ బాబు, ఆలపాటి రాజాలు వెళ్లనున్నారు.

Tags:    

Similar News