చంద్రన్నకు ఓటేయకపోతే పురుగులు పడతాయి

రాష్ట్రవ్యాప్తంగా పసుపు – కుంకుమ, పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఘనంగా జరిపించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో [more]

Update: 2019-02-02 13:42 GMT

రాష్ట్రవ్యాప్తంగా పసుపు – కుంకుమ, పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఘనంగా జరిపించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో సభలు నిర్వహించి భోజనాలు పెట్టి పింఛన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేపట్టారని, మళ్లీ ఆయన అధికారంలోకి రాకపోతే ఇవన్నీ మటాషే అన్నారు. చంద్రబాబుకు గనుక ఓట్లేయకుండా అన్యాయం చేస్తే నోట్లోకి కూడు రాదని, పురుగులు వస్తాయని ప్రజలను హెచ్చరించారు. ప్రజలకు శాపనార్ధాలు పెట్టడం వివాదాస్పదమవుతోంది.

Tags:    

Similar News