వైసీపీ కార్యాలయంపై టీడీపీ దాడి

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి దిగారు. టీడీపీ స్థానిక నేత బోయిన రమేష్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున [more]

Update: 2019-02-14 07:56 GMT

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి దిగారు. టీడీపీ స్థానిక నేత బోయిన రమేష్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున టీడీపీ నేతలు ఇనుప రాడ్లతో ఒక్కసారిగా వైసీపీ ఆఫీసులోకి చొచ్చుకువచ్చారు. అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దాడిలో ఆరుగురు వైసీపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. టీడీపీ నేతల దాడికి నిరసనగా వైసీపీ నేతలు ధర్నా చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలంతోనే దాడి చేశారని, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News