వైఎస్ భారతిని కూడా చేరుస్తారా?

జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి నివాసంలో ఎలా నిర్మించారని, ఎవరు దానిని జగన్ కు బహుమానంగా ఇచ్చారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. వైఎస్ భారతి [more]

Update: 2020-01-03 12:57 GMT

జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి నివాసంలో ఎలా నిర్మించారని, ఎవరు దానిని జగన్ కు బహుమానంగా ఇచ్చారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. వైఎస్ భారతి రెడ్డి తాడేపల్లిలో 2019లో ఫిబ్రవరిలో కొనుగోలు చేశారని, అంతకు ముందు కొనుగోలు చేసిన వారు మీ బినామీలా? అని దూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. తాడేపల్లిలోని జగన్ ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా? అని నిలదీశారు. భారతీరెడ్డి, సండూరు పవర్ కంపెనీ, హరీష్ ఇన్ ఫ్రా కంపెనీ, భారతీ సిమెంట్స్ పేరు మీద ఎందుకు కొనుగోలు చేశారని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లి ప్రాంతంలో పెద్దయెత్తున బినామీ పేర్లతో జగన్ భూములు కొనుగోలు చేశారన్నారు. మూడు ఎకరాల్లో పెద్ద భవనం జగన్ కట్టుకుంది అక్రమం కాదా? అని నరేంద్ర ప్రశ్నించారు. ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ ను సీబీఐకి అప్పగిస్తే భారతీరెడ్డి పేరు చేరుస్తారా? లేదా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News