వీటిపై మీ చూపు పడాలి

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం ఇవ్వాళ రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసింది. వైసీపీ ప్రభుత్వం మూడు నెలల [more]

Update: 2019-09-19 07:44 GMT

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం ఇవ్వాళ రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసింది. వైసీపీ ప్రభుత్వం మూడు నెలల పాలనలో జరిగిన దాడులు, మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు గల కారణాలు, ప్రభుత్వ వేధింపులు, టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు వంటి వాటిపై గవర్నర్‌కు ఈ బృందం వివరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు వెంట జాతీయ కార్యదర్శి నారా లోకేష్, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, నిమ్మల రామానాయుడు, కరణం బలరాం, అచ్చెంనాయుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య , యలమంచిలి రాజేంద్రప్రసాద్ లతో పాటు ఇతర నాయకులున్నారు.

 

Tags:    

Similar News