వివేకానంద‌రెడ్డిని జ‌గ‌నే హ‌త్య చేయించాడు: టీడీపీ

ఎన్నిక‌ల్లో సానుభూతి పొందేందుకు త‌న బాబాయి వివేకానంద‌రెడ్డిని వై.ఎస్.జ‌గ‌నే హ‌త్య చేయించి ఉంటాడ‌ని తెలుగుదేశం పార్టీ సంచ‌ల‌న ఆరోపణ‌లు చేసింది. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా [more]

Update: 2019-03-15 12:14 GMT

ఎన్నిక‌ల్లో సానుభూతి పొందేందుకు త‌న బాబాయి వివేకానంద‌రెడ్డిని వై.ఎస్.జ‌గ‌నే హ‌త్య చేయించి ఉంటాడ‌ని తెలుగుదేశం పార్టీ సంచ‌ల‌న ఆరోపణ‌లు చేసింది. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మాట్లాడుతూ… తండ్రి చ‌నిపోతేనే స్పందించ‌కుండా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం జ‌గ‌న్ సంత‌కాలు సేక‌రించార‌ని, ఇప్పుడు కూడా బాబాయ్ చ‌నిపోతే స్పందించ‌కుండా లోట‌స్ పాండ్ లో కూర్చొని శ‌వ‌రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. వివేకానంద‌రెడ్డికి ఎవ‌రితోనూ గొడ‌వ‌లు లేవ‌ని, కేవ‌లం జ‌గ‌న్ తో గొడ‌వ‌లు ఉన్నాయ‌న్నారు. క‌డ‌ప పార్ల‌మెంటు సీటు కోసం వివేకానంద‌రెడ్డి, జ‌గ‌న్ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని ఆరోపించారు. రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టించాల‌నే దురుద్దేశంతోనే హ‌త్య చేయించార‌ని ప్ర‌జ‌ల‌కు అనుమానాలు ఉన్నాయ‌న్నారు. హ‌త్య ద్వారా సానుభూతితో ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని ప్ర‌శాంత్ కిషోర్ డైరెక్ష‌న్ తో ఈ హ‌త్య జ‌రిగింద‌ని అనుమానాలు ఉన్నాయ‌న్నారు. తండ్రి మ‌ర‌ణాన్ని అడ్డుపెట్టుకొని గ‌తంలో జ‌గ‌న్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందాడ‌ని టీడీపీ నేత లింగారెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News