తమిళిసైకి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు

తెలంగాణ గవర్నర్ తమిళి సైకి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. తమిళి సై కి 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు [more]

Update: 2021-03-05 01:13 GMT

తెలంగాణ గవర్నర్ తమిళి సైకి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. తమిళి సై కి 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రకటించింది. తమిళి సైతో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ దేశాలకు చెందిన మహిళలతో పాటు తమిళి సై ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. ఈ నెల 7వ తేదీ నుంచి ఆ సంస్థ అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును ప్రదాానం చేయనుంది. అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడంతో తమిళిసైకి పలువురు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News